పరమశివుని శిష్యుడీ పరశురాముడు కర మఱుదగు విక్రమంబు కలిగినవాడు |
|
జవమున క్రౌంచమును హంసలపాలు చేసి శివు డిచ్చిన పరశువును చేతబట్టినాడు అవలీలగ కార్తవీర్యార్జును పొగరణచి కువలయపతిజాతిని కుళ్ళబొడిచినాడు |
పరమ |
భూమి నెల్ల కశ్యపుడను ముని కిచ్చినాడు భూమీశులపైన పగను పోనడచినాడు తామసము విడచినాడు తపసియై నాడు ఆ మహేంద్రగిరివరం బందు నిలచినాడు |
పరమ |
విష్ణుమూర్తి యంశయై వెలసినాడు భువిని విష్ణుసోదరికి పరమ వీరభక్తు డతడు విష్ణుచాపము రామ విభుని చేతి కిచ్చి విష్ణువే రాము డనుచు వినుతి చేసినాడు |
పరమ |