2, అక్టోబర్ 2017, సోమవారం

పూజ్య బాపూజీనీ హేళన చేసిన నీహారిక తెంపరితనం!



పాఠక మహాశయులారా,

అందరికీ శంకరాభరణం బ్లాగు తెలిసే ఉంటుంది.

సమస్యాపూరణం అనేది ఒక ప్రముఖ సాహిత్యప్రక్రియ. సాధారణంగా సమస్య అంటే ఒక పద్యపాదంగా ఇస్తారు.  ఆసక్తి కల కవులు పద్యాన్ని సరసంగా పూర్తిచేయాలి.

సమస్యాపూరణంలో ఇచ్చే సమస్యలు గడ్డుగానే కనిపిస్తాయి. "భార్య లిద్దరు శ్రీరామభద్రునకును" అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాముడు ఏకపత్నీవ్రతుడు. ఆయన భార్య సీత. మరొక భార్య కూడా ఉందని చెప్పి పద్యం పూర్తిచేయ మంటారేమిటీ అని అనిపిస్తుంది.

అదే తమాషా. అలాంటి గడ్డు సమస్యనూ అందమైన పద్యంగా చెప్పాలి.
ముఖ్యంగా ఔచిత్యం ఎక్కడా కించిత్తు కూడా దెబ్బతిన కూడదు మరి.

శంకరాభరణం బ్లాగును  శ్రీ కంది శంకరయ్య గారు ఏళ్ళతరబడి ఎంతో నిష్ఠతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఎందరో ఔత్సాహిక కవులూ అప్పుడప్పుడు కాస్త చేయితిరిగిన కవులూ కూడా పాల్గొని బ్లాగును జనరంజకంగా చేస్తున్నారు.

ఈ నాటి సమస్య  "గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము" అనేది.

ఔత్సాహికులైన కవులు యథాశక్తి పూరణలు చేస్తున్నారు.

ఐతే ఒక పూరణ క్రింద నీహారిక గారు ఒక వ్యాఖ్య చేసారు. "బోడిగుండు ని చూసి బోర్ కొడుతుంది" అని!

ఈ చెత్తవ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది.

పూజ్యబాపూజీని అవమానించేదిగా ఉంది.

మీరూ గమనించండి.   (క్రింది బొమ్మపైన క్లిక్  చేసి పూర్తి పరిమాణంలో చూడవచ్చును)




ఇదేమి తెంపరి తనం?

నీహారిక గారు సాటి బ్లాగర్లను నోటికి వచ్చినట్లు తిడుతూ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇదేమి కొత్త కాదు.

చివరికి ఆవిడ పూజ్య బాపూజీని కూడా వదిలిపెట్టకుండా అడ్డదిడ్దంగా మాట్లాడటం ఏమిటీ?

ఆవిడ తాను ప్రపంచసామ్రాజ్ఞిని అనుకొంటూ  తనకు ఎవరిమీద కోపం వస్తే వాళ్ళందరినీ హీనంగా సంబోధిస్తూ వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలతో విసిగించటమూ ఏవేవో శిక్షలు వేసేస్తున్నానంటూ బెదిరింపులు విసరటమూ చేస్తూ వస్తున్నారు.

ఆవిడ పూర్తిస్పృహలోనే ఉండి ఇలా వ్యవహరిస్తున్నారో లేక ఆవిడకు ఏమన్నా మానసిక సమస్య ఉన్నదో అర్థం కావటం లేదు.

అసలు నీహారిక గారికి శంకరాభరణం బ్లాగుతో ఏమి పని?

నాకు తెలిసినంతవరకూ ఆవిడ పద్యాలు గట్రా ఏమీ వ్రాయరే?

నీహారిక గారైనా మరెవరైనా చేతనైతే అక్కడ ఇచ్చిన సమస్యను పద్యరూపంలో చక్కగా సరసంగా పూరించటానికి ప్రయత్నించాలి. ఇంకా శక్తి ఉంటే,  అక్కడకు వస్తున్న పూరణల గుణదోషాలను చర్చింవచ్చును.

లేకపోతే

అక్కడ కవులూ ఔత్సాహికులూ చేస్తున్న పూరణలను చదివి ఆనందించాలి.

లేదా

తనపనేదో తాను చూసుకోవాలి.

అంతే కాని పూజ్య బాపూజీని అవమానిస్తూ వ్యాఖ్య పెట్టటం ఏమిటి?

జాతిపితను అవమానించటం చూస్తూ సహించి ఊరకోలేక ఈ టపా వ్రాస్తున్నాను. అంతే కాని తీరికూర్చుని ఈ నీహారిక ప్రసక్తి ఎత్తతం నాకు  ఎంతమాత్రమూ  అవసరం కాదు.

బాపూజీని కూడా వదలకుండా గాంధీజయంతి రోజున ఇలా ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించటం ఎంతమాత్రమూ క్షమించరాని నేరం.

నిత్యమూ శిక్షలూ శిక్షలూ అంటూ అందరివెంటా పడే ఈ నీహారిక గారికి ఇలాంటి అసహ్యమైన వ్యాఖ్య చేసినందుకు తప్పకుండా శిక్ష పడవలసిందే. సందేహం లేదు.

ఈ విషయంలో అందరూ నీహారిక గారి  ప్రవర్తనను ముక్తకంఠంతో గర్హించవలసిన అవసరం ఉంది.

జైహింద్!