11, జూన్ 2014, బుధవారం

సీమాంధ్రవారికి కుట్రలు పన్నటం తప్ప వేరే పనిలేదనుకుంటే ఎలా?

శ్రీగుండు మధుసూదన్ గారు నిత్యం సీమాంధ్రవారి కుట్రలగురించి పుంఖానుపుంఖాలుగా వ్రాస్తూనే ఉంటారు. తెలంగాణా వచ్చాక కూడా వారేమీ శమించలేదు - నిందాలాపాలు తగ్గించలేదు.  అందుచేత విసుగుచెంది, ఈరోజున వారి నా తెలంగాణ కోటి రత్నాల వీణ బ్లాగులో నేను ఉంచిన వ్యాఖ్య.  వారు నా వ్యాఖ్యను ప్రకటించకపోవచ్చును కాబట్టి, నేనే దానిని ప్రకటించుకుంటున్నాను.

గుండువారూ, 

అబ్బబ్బ ఆపండి మీ‌ కుట్రపురాణప్రవచనం

సీ. ఎండహెచ్చిన కుట్ర ఎండతగ్గిన కుట్ర
  సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
మబ్బటు పో కుట్ర మబ్బిటు రా కుట్ర
  సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
వాన కురియ కుట్ర వాన వెలియ కుట్ర
   సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర
గాలివీచిన కుట్ర ధూళిరేగిన కుట్ర
   సీమాంధ్రవారి మాచెడ్డ కుట్ర

తే.గీ. పేదసీమాంధ్రయునికియే పెద్దకుట్ర
ఇంత యన్యాయమును సైచి యెదురుతిరిగి
బ్రతికి సీమాంధ్రజనులుంట పరమకుట్ర
కుట్రలకు వారు లొంగమి కూడ కుట్ర

ఇక నైనా కాస్త ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి.  నిత్యమూ సీమాంధ్రమీద నిందలేనా? వేరే పనిలేదా?

36 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారు,

    మధుసూధన్ గారు మంచి కవి. ఆయన బ్లాగులో గతంలో కూడా అదే మాట చెప్పాను. ప్రస్తుతం రెండు రాష్త్రాలు విడిపోయాయి. ఇక దాని గురించి పెద్దగా చర్చించ నవసరం లేదు. కానీ ఈ మధ్యనే వళ్ళంతా నామాలు పెట్టుకొని భాజపాలో చేరిన పత్రికాధిపతి మరియు గుత్తేదారు అయిన రాజం గారి పత్రికలో రోజు ఐదు కోట్ల (ఇప్పుడే పుట్టిన పసి పిల్లలతో సహా) ఆంధ్రులు అను నిత్యం జరుపుతున్న దురాగతలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు అచ్హొత్తుతారు. అలా వార్తలు రాయకపోతే పత్రిక అమ్ముడుపోదు. ప్రజలు అసలు విషయాలు మర్చిపోవాలంటే ఇది చాలా అవసరం. ఇది వ్యాపార రహస్యం.

    మధుసూధన్ గారు మంచి కవి, ఆయన తన కవిత్వంపై ఎక్కువ ద్రుష్టి పెట్టి ఆ రంగంలో రాణించాలని కొరుకుంటూ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీగుండు మధుసూదన్‍గారు మంచి కవి కావచ్చును. కాని ఆయన నిత్యశంకితుడు నిత్యదుఃఖితుడుగా నిందాలాపాలతో ప్రొద్దుపుచ్చటం విచారకరం.

      తొలగించండి
    2. గుండు వారి బ్లాగ్ చూస్తుంటే
      కలిగిన భావం :

      "వేష భాషలు చూడ
      పండితుని లెక్క
      పదము పెదవిని వీడ
      అమ్మ నీ యక్క"

      తొలగించండి
  2. కోటి ఏడుపుల జాణ
    నేనింకా హిమాచల్ ప్రదేశ్ లో మరణించిన విద్యార్ధుల రేస్క్యు ఆపరేషన్ కి ఆంధ్రా ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పుడు . ఈ గుండు సూది ఎలాస్పందిస్తుందా అనుకున్నా. ఇంకా తగ్గని ఆంధ్ర పెత్తనం అని వ్రాస్తారేమో అని భయపడ్డా కూడా.... వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు కూడా అదృష్టవశాత్తు గుండుసూది గుచ్చుకోలేదు.

    నాయిని నరసింహా రెడ్డి ఉత్సవ విగ్రహంలా కూర్చున్నా కేంద్ర ఆంధ్ర ప్రభుత్వాలు చొరవ చూపిన తీరుపట్ల కనీసం ఈ తెలబాన్ రచయితలు సానుకూలంగా నాలుగు మాటలు వ్రాసి ఉంటె బాగుండేది . అవి రాయరు . ఇప్పుడు తాజాగా తెలంగాణా లో ఆలయాలలో పూజారుల ను ఎంచుతున్నరటగా ... పేద బ్రాహ్మడి శాపం ఊరికేపోదులెండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసు గారు, చిన్న సూచన. ఇహనుండి తెలబానులు అన్న పదాన్ని రాయవద్దు. ఈ చిన్న ప్రయత్నం ఆంధ్రుల తరఫున మన నుండే మొదలు పెడదాం.

      తొలగించండి
    2. అయ్యా, అతి మంచి ఆంధ్రుడు గారు, మీకు చాలా దుగ్ధ వున్నట్టుంది తెలపాముల దృష్టిలో మంచి అనిపించుకోవాలని, దయ చేసి ఆ ప్రయత్నం మానండి.మనం అవునన్నా కాదన్నా తెలపాములు తెలపాములే.

      తొలగించండి
  3. తెలంగాణాలో ఏమి జరిగిన దానికి సీమాంధ్రులే బాధ్యులుగా కొంత మంది ఫిక్స్ అయిపోయారు..... సీమాంధ్ర నాయకులు వారి స్వార్ధం కోసమో, తెలియకనో పూర్తిగా సీమాంధ్రను నిర్లక్ష్యం చేసి హైద్రబాద్ దాని చుట్టు ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి, ఇప్పుడు దానికైనా అప్పులలో సీమాంధ్రకు భాగస్వామ్యం చేశారు..... ఏకపక్ష విభజన చేసినాక కూడ ఇంకా ఈ ఏడ్పులు ఎందుకో..........

    రిప్లయితొలగించండి
  4. గూండా మందు "సూదు" ఒక పైత్యం తల కెక్కిన తెలపాము. వాడిని ఇంకా మంచి కవి అని సన్నయి నొక్కులు నొక్కడం ఆంధ్రులకే చెల్లింది. పాముకు పాలు పొయ్యకండి. మీరు తెలపాముల దృష్టిలో ఎంత మంచి అనిపించుకుందామనుకొన్న, అవి తెలపాములన్న విషయం గుర్తు పెట్టుకోండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరీ ఇంత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్న వాళ్ళని తాలిబాన్లని మాత్రమె చూసాను , ఇప్పుడు తెలబన్లని చూస్తున్నా. ప్రతీ దానికీ ఆంధ్రా ని నిందించడమే. మరీ అంత ద్వేషం ఏంటి రా బాబూ. ఎంత ద్వేషం కక్కుతున్నా సంయమనం పాటించారు ఆంధ్రా వాళ్ళు. ఊరికే ఉంటే అబధ్ధాలనె నిజాలుగా ప్రచారం చేస్తారు. మంచిగుందాం అని స్నేహ హస్తం ఇస్తే దాన్నే నరికేసి మొండి చేయి ఇచ్చాడు చూడు అంటే టైపు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఉంటేనే వీళ్ళు దారిలోకి వస్తారు.

      తొలగించండి
    2. @శ్రీరామ,
      మీరు చెప్పింది నిజమే, వాళ్ళ పద్యా లన్నీ కృతక భాషా పాండిత్యమూ, వ్యర్ధ పదాడంబరమూ. ఆ రెంటినీ తీసేస్తే అదే భావాన్ని శుధ్ధ వచనంలో ఇంకా అందంగా చెప్పొచ్చు.ఇవ్వాళ వీళ్ళు రాసే పద్యాల కన్నా కృష్ణ శాస్త్రి నుంచి నన్నయ్య గారి వరకూ యెవరి పద్యా లయినా చక్కగా అర్ధ మయ్యేలా ఉంటాయి.

      వాళ్ళు మన మీద అనత విషం కక్కుతున్నప్పుడు మాత వరసకయినా మనమెందుకు వాళ్ళని పొగడాలి?

      తొలగించండి
    3. "వీళ్ళు రాసే పద్యాల"

      హరిబాబు గారూ, "వీళ్ళు" అంటే ఎవరు?

      తొలగించండి
    4. గుండు మధుసూదన్ మరియు ఆచార్య ఫణీంద్ర

      తొలగించండి
    5. పొరబడుతున్నారండీ.

      శ్రీగుండువారు కొంచెం తీవ్రతెలంగాణావాది. వారిదృష్టిలో అమిరికన్ వైట్‌హౌస్‌కూడా మొదట తెలంగాణాకే చెందినా ఆశ్చర్యపోవలసింది లేదు. తెలుగువాళ్ళు ఐతే తెలంగాణావారైనా కావాలి లేదా తెలంగాణాద్రోహులైనా కావాలి శ్రీక.చ.రావుగారు సెలవిచ్చినట్లు.

      శ్రీఫణీంద్రగారు సౌమ్యులు. వారు తెలంగాణావాది కావచ్చును కాని శ్రీగుండువారిలాగా పిడివాదం చేసేవారు కాదే నాకు తెలిసి!

      ఇద్దర్నీ‌కవితాపటిమ విషయంలో కూడా పోల్చలేమనుకుంటాను. పుంఖానుపుంఖాలుగా పద్యాలు బరికేస్తున్నా శ్రీగుండుగారు ఇంకాసాధనదశలోనే ఉన్నారనిపిస్తుంది నాలాగా. శ్రీఫణీంద్రగారు కొంచెం చేయితిరిగినకవిగారే అనిపిస్తుంది.

      మీరు ఇద్దర్నీ ఒకేగాటన కట్టటం‌ నాకైతే నచ్చలేదు. మన్నించాలి.

      తొలగించండి
    6. శ్యామలీయం మాస్టారూ, మీరు హరిబాబు గారి వ్యాఖ్య చూడండి. ఈ ఇద్దరు కవులకు "కృతక భాషా పాండిత్యమూ, వ్యర్ధ పదాడంబరమూ" తప్ప వేరే లేదని హరిబాబు గారి అభిప్రాయం. అంతేతప్ప వారి తెలంగాణా వాదంలో తేడాలను పరిగణలో తీసుకోలేదు.

      తొలగించండి
    7. ముందుగా పై నా కామెంట్ల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను.నేను చిన్నప్పట్నించీ కొంచెం BOM(BALANCE OF MIND) తో ప్రవర్తిస్తూ ఉందే వాణ్ణి.చిన్నప్పుడు ఫ్రెండ్స్ సహజంగా పోట్లాడుకుంటే మాటలు మానెయ్యడం అనేది ఒకటి ఉండేది కదా?కానీ నాకు అంత చిన్న వయసులోనూ అది కూడా చెత్తగా అనిపించేది.మరీ ముఖ్యంగా నన్ను కూడా యేదో ఒక గ్రూప్లో చేరి రెండో గ్రూప్తో మాటలు మానేసేలాగ వంచాలని చూసేవాళ్ళు.లొంగేవాణ్ణి కాదు.నా కిలాంటి సిల్లీ థింగ్స్ నచ్చవని చెప్పేసే వాణ్ణి. అంత సీరియస్గా BOM మెయింటైన్ చేస్తున్న నేను కూడా బొక్క బోర్లా పడిపోయాను.మీరు ఈ పోష్టులో ఇచ్చిన లింకు ప్రభావం.కొద్ది రోజుల్నుంచీ నా అంతట నేనే ఇక బ్లాగుల్లో విభజనకి సంబంధించిన విషయాల గురించి పట్టించుకోవడం మానేద్దామా అని అనుకుంటుండగానే ఈ హంసపాదం పడిపోయింది.

      నేను మొదట్లోనే ధర్మమేవ జయతే బ్లాగులో ఒక కామెంట్ వేసాను.నాకు నచ్చిన నా కామెంట్లలో అది ఒకటి.కానీ పబ్లిష్ కాలేదు.మీరు ఈ రకంగా వెళ్ళడం వల్ల అంతిమ ఫలితం కూడా సరిగ్గా ఉండదు,మీకు వచ్చేది కూడా సమస్యలతో కూడిన తెలంగాణా వస్తుంది అని.అదే నిజమయింది ఇవ్వాళ.సొంత డబ్బా కొట్టుకోవడం అని కాదు గానీ అప్పుడు జరుగుతున్నదాన్ని బట్టి దీని తర్వాత దశలో ఇది యే దారికి వెళ్తుంది,యే రూపాన్ని తీసుకుంటుంది అనే నా అంచనాలు చాలామటుకు నిజమవుతున్నాయి.

      నాయకులు ఇప్పుడే నిజాలు చెప్పేస్తే ప్రజలు మరీ జావగారి పోతారనో యేమో బింకంగా ఉన్నారు గానీ రెండు ప్రాంతాల వారికీ ఒక 2 సంవత్సరాల తర్వాత భ్రమలు పోయి వాస్తవాలు కళ్ల ముందు కనపడతాయి.అవి అంత ఆశాజనకంగా లేవు నా లెక్క ప్రకారం. ఆ రకమయిన ఆందోళన కూడా తన ప్రభావాన్ని చూపించిదేమో మరి!

      కాబట్టి పై వారిద్దరి కవిత్వం గురించి నేను చేసిన దుర్మార్గమయిన వ్యాఖ్యల్ని వాపసు తీసుకుంటున్నాను.మొదట మిమ్మల్ని తీసెయ్యమని అడుగుదా మనుకున్నాను.కానీ ఉంచండి, మరీ దుర్భరమయిన పశ్చాత్తాపంలో కూరుకుపోవడం లేదు గానీ మళ్ళీ ఇలాంటి పొరపాటు దొర్లనివ్వకూడదనుకుంటున్నాను.

      తొలగించండి
    8. హరిబాబుగారూ, ప్రమాదో ధీమతామపి. ఒక్కోసారి అలాంటి పొరబాట్లు దొర్లుతాయి. సరిచేసుకుం టూ ముందుకు సాగిపోవటమే.

      తొలగించండి
    9. సానుకూల స్పనద్నకు కృతజ్ఞతలు.కానీ ముందు కాలంలో తప్పనిసరిగా తెలి వచ్చే విషయం ఒకతి ఉంది.ఇంకెంతో కాలం తెలుగు వాళ్లని కేవలం భాష తో ఒక్కటిగా ఉంచటం సాధ్య పడక పోవచ్చు.ఆంధ్ర ప్రాంతం లోని మేధావులు యెంత తొందరగా "రాష్ట్రాలుగా విడిపోయినా మనం భాష పరంగా ఒక్కటే" అనే మిధ్యని వొదిలించుకుంటే అంత మంచిది. శ్రీ గుండు మధుసూదన్ గారు, ఆచార్య ఫణీంద్ర గారు, జై గొట్టి ముక్క్కల గారు కేవలం TIP OF THE ICEBERG.వీళ్ళందర్నీ ప్రభావితం చేస్తున్న భావజాలం గురించి అమాయకంగా ఉంటున్నాం.

      ఈ యాభై యేళ్ళుగా చేస్తున్నట్టు చూసీ చూడనట్టుగానో, అనత ప్రమాదం యేమీ జరగదులే అని మంకి మనమె సర్ది చెప్పుకోవదం వల్లనే ఇప్పటి స్థితి వచ్చింది, ఇక ముందు కూడా ఈదే అమాయకత్వం ప్రదర్శిస్తే మన ప్రాంతపు భవిష్యత్తు మనల్ని క్షమించదు.వాళ్ళెప్ప్పుడో ముస్గులు విప్పేశారు.మనం కూడా విప్పెయ్యాలి వీలయినంత తొందరగా!

      ఇంకా తెలుగువాళ్ళు- వాళ్ళని కలపడం అనే సుత్తి రెండు చోట్లా అధికారాన్ని ఆశించే తెదెపాకి మాత్రమే అవసరం,మనకి కాదు. ఆ రెండు కళ్ళ సిధ్ధాంతం చాటున మన రాష్ట్రానికి బెండు వెయ్యకుండా కళ్ళు తెరుచుకుని గమనించాలి.

      తొలగించండి
    10. హరిబాబుగారూ, కారణాలు ఏమైనా తెలుగుగడ్డ రెండుముక్కలైపోయింది. ఈ పరిణామం ఒకవంకవారికి ఆవేదననీ మరొక వంకవారికి ఆనందాన్నీ ఇచ్చింది. కొట్లాటలతో విడిపోయి ఇంకా భౌతికంగావిడిపోయాం మానసికంగా కలిసి ఉందాం అని అనుకోవటం అంత సబబు కాదు. నిజానికి ఈ విడగొట్టిన మహానుభావులు తెలుగువారిని మొదటగా మానసికంగానే విభజించారని మరువరాదు! ఎవరిమేలు వారు చూసుకోవటం తప్పనిసరి - అది ఎంత బాధాకరమైన మాట ఐనా కఠిన వాస్తవం. ముందుముందు తరాలవారిక్ వాస్తవచరిత్రపేరుతో తెలంగాణావాదులు సీమాంధ్రప్రజలమీద మరింత విద్వేషవిషం నూరిపోస్తారు. అందులో సందేహం అక్కరలేదు. ఐతే ఇలా సీమాంధ్రమీద విరుచుకు పడే వారిలో సమ్యక్చింతనులుగా ఉండవలసిన మేధావులూ స్వయంగా దూషణలతో ముందువరసల్లో ఉండటం చాలా విచారం కలిగిస్తోంది.

      తొలగించండి
  5. తా దూర కంత లేదు మెడ కో డోలని "మా ఉద్యోగాలు లక్షల్లో దోచుకున్నారు" అని యేడ్చారు.ఇప్పుడు కేంద్ర సంఘం రాష్ట్రం మొత్తం మీద అటూ ఇటూ మార్చాల్సిన ఉద్యోగు లందర్నీ లెక్కేసినా యాభై వేలు దాటటం లేదు.మరి మనం లక్షల్లో దోచుకున్న వారి మిగిలిన ఉద్యోగులు యెక్కడికి పోయారో?

    రేరేపు అధికారం లోకి వచ్చాక తెలంగాణా ప్రభుత్వం వారు అధికారికంగా లక్కలు వేశాక గానీ అసలు లెక్క బయట పడదు.అప్పుడు దాన్ని యెలా సమర్ధించుకుంటారో?

    అసలు నవ్వొచ్చే విషయ మేమిటంటే ముఖ్యమంత్రి సేషీ లోనే ఉద్యోగులు ఇంకా కుదురుకోలేదు, మంత్రులే తెలంగాణాకి ఉద్యోగుల కొరత ఉండవచ్చు అంటుంటే గుండు కవి గారేమో యెక్కడో ఉన్న ఆలయాల్లో సిబ్బంది గురించి అల్లాడి పోతున్నారు :-P)

    రిప్లయితొలగించండి
  6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఉంటేనే వీళ్ళు దారిలోకి వస్తారు.
    >>
    మనం యేమీ ఆందోళన పడాల్సిన పని లేదు.వారెంత రెచ్చగొట్టినా మన పృఅశాంతతని వొదులుకోకపోవదమే మనకు శ్రేష్టం!

    తమాషా యేంటంటే కచరా దగ్గిర్నుంచీ తెవాదు లంతా తెదెపా ని తెలంగాణా నుంచి తరిమి కొట్తాలని చూశారు - ఆంధ్రోడివి నీ కిక్కడేం పని అని యేడుస్తూ.తీరా చూస్తే తెదెపా జాతీయ పార్టీ అయి కూర్చుంది,వారెవ్వా?!కచరా గారి కి ముందు యెవరైనా పోలవరం గురించి పట్టించుకున్నారో లేదో తెలియదు గానీ వీళ్లెంత గట్టిగా యేడిచారో అంత గట్టిగా అది జాతీయ ప్రాజెక్ట్ అయి కూచుంది, వహవ్వా?!

    బాలనాం రోదనం బలం. ఆ యేడుపు యే పిల్లడు యేడిస్తే వాడికే బలం.కానీ ఆంధ్రానాం తెలంగాణ్య రోదనం బలం?!

    కవి వాక్యం:
    ఒకరి మేల్ తన మేలని యెంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్
    పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాతీయ పార్టీ హోదా కావాలంటే నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు ఉండాలండీ. ఇప్పట్లో తేదేపాకు అంత సీను లేదనుకుంటా?

      తొలగించండి
    2. గొట్టిముక్కలవారూ, మీరన్నది సత్యం.

      తొలగించండి
    3. @jai
      మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం వోట్లు వుంటే చాలునని అన్నారు, డిల్లీ లోనో మరొక చోటో ప్రయత్నిస్తే వొచ్చేస్తుందన్నారు?అదీ వొస్తుంది లెంది, ప్రయత్నిస్తారు మిత్రుల ద్వారా.మీరింకొంచెం గట్టిగా యేడ్వాలి మరి
      :-))

      తొలగించండి
    4. "తెదెపా జాతీయ పార్టీ అయి కూర్చుంది" (past tense)

      ఇంకా కాలేదు (future tense?)

      ప్రయత్నించండి నాకెందుకు ఏడుపు?

      తొలగించండి
  7. వ్యాఖ్యాతలకు మనవి.
    నిందాలాపాలకూ పరుషవాక్యాలకూ నొచ్చుకుంటున్నామని చెబుతూ తామూ అటువంటిధోరణిలో వ్రాయటం బాగుండదు కదా. హుంందాగా ఉండే భాషలోనే వ్రాయండి. నొక్కిచెప్పాలంటే దురుసుమాటలు అవసరం అనుకోవటం అపోహమత్రమే అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  8. "The only good communist is a dead communist" అని "కోల్డ్ వార్" రోజుల్లో 1950 వ దశాబ్దంలో ఒక అమెరికా రాజకీయవేత్త అన్నాడని అంటారు. ఆ వాక్యంలో కమ్యూనిస్ట్ బదులు ఆంధ్రుడు అని చదువుకుంటే ఈనాటి కొంతమంది తెలంగాణావాదులకు నచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది బ్లాగులు చూస్తుంటే. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఈ ప్రతివాదాల వల్ల ఏమీ ఒరగదని, ఎవరి తీరూ మారదని, అందుకని ఇంక అనవసరమని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  9. శ్యామల రావు గారు, నా వ్యాఖ్య ఒకటి నిన్న పంపించాను. కాని అది పంపబడినట్లు, అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు స్క్రీన్ మీద సాధారణంగా వచ్చే మెసేజ్ నాకు కనపడలేదు. అందుకని ఆ వ్యాఖ్యని మరొకసారి ఇప్పుడే పంపించాను. రెండూ మీకు వచ్చినట్లైతే ఒకటి డిలీట్ చేసెయ్యండి ప్లీజ్ (ఈ మెసేజ్ తో సహా).

    రిప్లయితొలగించండి
  10. "The only good communist is a dead communist" అని "కోల్డ్ వార్" రోజుల్లో 1950 వ దశాబ్దంలో ఒక అమెరికా రాజకీయవేత్త అన్నాడని అంటారు. ఆ వాక్యంలో కమ్యూనిస్ట్ బదులు ఆంధ్రుడు అని చదువుకుంటే ఈనాటి కొంతమంది తెలంగాణావాదులకు నచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది బ్లాగులు చూస్తుంటే. జరిగిందేదో జరిగిపోయింది (విభజన) కాబట్టి ఈ ప్రతివాదాల వల్ల ఏమీ ఒరగదని, ఎవరి తీరూ మారదని, అందుకని ఈ మాటల యుద్ధం ఇంక అనవసరమని నా అభిప్రాయం.

    ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని హరిబాబు సూరనేని గారు "ప్రజ-తెలుగువారి చర్చావేదిక" బ్లాగులో పెట్టిన వ్యాఖ్య ఇప్పుడే చూశాను. మంచి నిర్ణయం at last. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహారావుగారూ, మీరు ప్రతీ వ్యాఖ్యనీ మూడేసిసార్లు పంపారు. కాని పనులవత్తిడివల్ల నేను వ్య్యాఖ్యలను రెండురోజులుగా చూడలేదు. ఇప్పుడే ప్రచురించాను. మీ మెయిల్‍కు సమాధానమూ పంపాను. గమనించగలరు.

      తొలగించండి
  11. శ్యామల రావు గారు.. ఇంతకీ గుండు వారు మీ కవిత ప్రచురించారా? అందులోకూడా ఆంధ్రుల కుట్ర ఎమన్నా ఉన్నదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండువారు నా వ్యాఖ్యను ప్రచురించలేదు. ఆలా జరగటం సాధారణమే. వారు తప్పనిసరిగా ఖండించదలచుకొన్నప్పుడు మాత్రమే నా వ్హ్యాఖ్యనూ దానికి ఖండననూ ఆయన బ్లాగులో దర్శించవచ్చును.

      తొలగించండి
  12. శ్రీగుండువారు ఒక వ్యాఖ్యను ప్రచురించకుండా ఆంధ్రావారు ఎలా అడ్దుకోగలరండీ? ప్రచురించకపోవటం వారిష్టమే పూర్తిగా - దానిలో కుట్రకోణం ఉందనలేము కదా. వారి బ్లాగు, వారి అభిరుచి. అంతే!

    రిప్లయితొలగించండి
  13. ఆంధ్రలో తెలంగాణా ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటుకి తెలంగాణా విద్యాశాఖ నిరాకరణ. ఏపీ కుట్రలకు తెలంగాణ సర్కారు దీటైన సమాధానం. ఈ పోస్ట్ చదివి నాకు నవ్వి నవ్వి ఊపిరి ఆడలేదు. ఆయనను ఎవరో ఇంటర్వ్యూ చేస్తే నేను సద్విమర్శ అయితే ప్రచురిస్తాను అన్నాడు. కానీ తిప్పి తిప్పి కొడితే 5 వ్యాక్యలు కంటే ఎక్కువ లేవు. దీని బట్టే తెలుస్తుంది ఆయన చిత్తశుద్ధి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనకు ప్రగాడమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటి అనుగుణంగా లేనివి సరైనవి అనిపించవు కదా. అందుచేత మీరు సద్విమర్శ అనుకొన్నది ఆయన దృష్టిలో అలా కాకపోవచ్చును. దాని కేమీ చేయలేము.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.