3, అక్టోబర్ 2017, మంగళవారం

సంసారమును దాటు సదుపాయ మేమి



(కళ్యాణి)

సంసార మందుండి సంసారమును రోసి
సంసారమును దాటు సదుపాయ మేమి

గురువు నన్వేషించి గురుపాదములు చేరి
గురువును సేవించి గురుకృప వలన
గురుబోధ బడసి యా గురుబోధ యందు
స్థిరుడై వర్తించిన నరుడు తరించును

దేవుని చింతించి దేవుని భజింయించి
దేవుని ధ్యానించి దినములు రేలు
దేవున కన్యము భావించ కుండిన
జీవుడు తరియించి దేవుని చేరును

తన తొలి యుని కేది తానేల నిటు వచ్చె
తన నిజ తత్త్వ మేమి తన విధ మేమి
యని యెంచి బ్రహ్మం బనగ తానే నని
ఘనముగ నెఱిగిన గడితేరు రామ


4 కామెంట్‌లు:

  1. కల్యాణి అన్నారు కాబట్టి పాడిన ఆడియో కూడా జతచెయ్యండి నిండుతనం వొస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు గాత్రదానం చేసే వారుంటే బాగుండేది. నేను పాటగాడను కాను!

      తొలగించండి
  2. భక్తి మార్గం ఉత్తమమమంటారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ మూడు విధాలుగా తరణోపాయం సూచించబడింది.
      మొదటిది. గురువు నాశ్రయించి సదసద్వివేకమూ‌ దైవపారమ్యమూ అనేవి తెలుసుకోవటం. దీనివలన చిత్తం ఐహికములనుండి దైవచింతనవైపుకు సక్రమంగా మళ్ళుతుంది.
      రెండవది. దైవచింతన. దైవము నందు అనన్యభావన. దీనివలన విషయవాసనాదులు క్రమంగా క్షయించి మోక్షార్హస్థితిని పొందుతాడు.
      మూడవది. తత్త్వమసీతి వాక్యార్థనిరూపణం. విషయవాసనలు క్షయమై చిత్తవృత్తి దగ్ధబీజం కాకుండా ఉన్నంతవరకూ అహమిక కారణంగా జన్మచక్రంలోనే ఉంటాడు జీవుడు. విషయవాసనలను గురుబోధ మరియు దైవానుగ్రహాల కారణంగా గెలిచిన పిదప మహావాక్యస్ఫూర్తి వస్తుంది. తానే బ్రహ్మము నన్న సత్యం వెల్లడి అవుతుంది. అదే జీవబ్రహ్మైక్యం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.