30, జులై 2013, మంగళవారం

పాహి రామప్రభో - 183

శ్రీరామచంద్రులవారికి ఆచమనీయం సమర్పించుకున్న తరువాత మనం చేయవలసిన ఉపచారం పంచామృతాలతో స్నానం‌ పరికల్పించటం.

పంచామృతాలంటే అవి పాలు, పెరుగు, తేనె, నేయి మరియు ఫలరసం. ఇందులో ఫలరసం, తేనెలు వృక్షసంబంధమైనవి. మినహా మిగతా మూడూ గోసంబంధమైన ద్రవ్యాలు.

పంచామృతస్నానం

ఆ.వె. పాలు పెరుగు నేయి ఫలరసంబులు  తేనె
శ్రవణమననదాస్యసఖ్యసేవ
నముల నాదు భక్తి  సమకూర్చె రామ పం
చామృతముల స్నాన మాడవయ్య

తాత్పర్యం: శ్రీరామచంద్రా, పంచామృతలైన పాలూ, పెరుగూ, నేయీ, తేనే, ఫలరసాలను  శ్రవణమూ, మననమూ, దాస్యమూ, సఖ్యమూ, సేవనమూ అనే నా భక్తి విశేషాలు సమకూర్చుతున్నాయి స్వామీ. చక్కగా ఈ పచామృతాలతో స్నానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.