29, డిసెంబర్ 2019, ఆదివారం

అమరావతి విధ్వంసం తగదు పై వ్యాఖ్య


ఆంధ్రా అనేది ఒక తమాషా బజార్
దీన్ని ఒక తమాషా కేంద్ర ప్రభుత్వం ఏర్వాటు చేసింది
అదీ ఒక తమాషా రాష్ట్ర విభజన నాటకంతో
ఒక రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధాని అంది
ఒక తమాషా కేంద్రప్రభుత్వం గుప్పెడు మట్టిని బహుమానంగా ఇచ్చింది
కొన్నాళ్ళపాటు ఆపసోపాలతో రాజధాని నిర్మాణం నడిచింది
మరొక రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది
అమరావతి కాదు అనేక రాజధానులు అంది.
రేపు మరొక ప్రభుత్వం వస్తుంది
అన్ని రాజధానులేమిటి అంటుంది
అప్పటికి ఉన్నవి అన్నీ మట్టి కొట్టుకొని పోతాయి
అమరావతి వెనక్కి వస్తుంది వీలైతే
లేదూ మరొక రాజధాని పేరు వినిపిస్తుంది.
ఆభోగం అంతా మరలా ప్రభుత్వం మారే వరకే
లేదా ఆంధ్రా మళ్ళా ముక్కలయ్యే వరకే
అప్పుడు తమాషా మళ్ళా మొదలౌతుంది
ఒకటో రెండో మూడో రాజధాని లేని రాష్ట్రాలు వస్తాయి
రాజధాని వెదుకులాటలు మొదలౌతాయి
ఒకటి కన్న ఎక్కువ తమాషాలు అన్నమాట
జనం చూస్తూనే ఉంటారు తమాషాలను
అంత కన్నా ఓట్లేసి మునగటం కన్నా ఏం చేయగలరు పాపం.


[ నేటి వనజవనమాలి బ్లాగు టపా అమరావతి విధ్వంసం తగదుపై నా స్పందన.]