1, జనవరి 2019, మంగళవారం

శ్రీరామసంకీర్తనంలో 500 కీర్తనల ప్రస్థానం


ఈ శ్రీరామసంకీర్తనా కార్యక్రమం ప్రస్థానం ఈక్రింది విధంగా ఉన్నది.

మొట్టమొదటి సంకీర్తన వేగ కనరావయ్య అన్నది 20, ఏప్రిల్ 2012, శుక్రవారం శుక్రవారం నాడు వెలువడింది.
100వ సంకీర్తనం బంటునై నిన్నంటి యుండే అన్నది 15, ఏప్రిల్ 2016, శుక్రవారం నాడు వెలువడింది.
200వ సంకీర్తనం దేవతలకు నైన తెలియరాదు అన్నది 31, అక్టోబర్ 2016, సోమవారం నాడు వెలువడింది.
300వ సంకీర్తనం హాయిగా శ్రీరామభజన అన్నది 23, ఫిబ్రవరి 2018, శుక్రవారం నాడు వెలువడింది.
400వ సంకీర్తనం త్రిజగన్మోహన రూపుని అన్నది 11, సెప్టెంబర్ 2018, మంగళవారం నాడు వెలువడింది.
500వ సంకీర్తనం జయజయ రామా అన్నది 1, జనవరి 2019, మంగళవారం నాడు వెలువడింది.

ప్రయాణవేగాన్ని గమనిస్తే మొదటి నూఱు సంపన్నం కావటానికి ఎక్కువ సమయం పట్టినా ఆపైన వేగంగానే కొనసాగినట్లున్నది.

శ్రీరామచంద్ర మహాప్రభువు సంకల్పం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ కార్యక్రమం ఇతోధికంగా కొనసాగే అవకాశం ఉన్నది.