24, మార్చి 2026, మంగళవారం

పద్యం వ్రాయటం గురించి - 5

పద్యనిర్మాణం చాలా విధాలుగా శుధ్ధంగా ఉండాలి. ఇవి స్థూలంగా ఎనిమిది విధాలుగా మనం గమనించవచ్చును.


1. ఛందశ్శుధ్ధి

2. భాషాశుధ్ధి

3. వ్యాకరణశుధ్ది

4. విషయశుధ్ధి

5. సందర్భశుధ్ధి

6. భావశుధ్ధి

7. ధారాశుధ్ధి

8. అన్వయశుధ్ధి

 

వీటి గురించి వచ్చే వ్యాసాలలో చర్చించుకుందాం.

 

ఒక విషయ మాత్రం ముందే చెప్పుకోక తప్పదు, పద్యం సరిగా వ్రాయాలీ అనుకొనే ఆసక్తీ శ్రధ్ధా ఉన్నవారికి మాత్రమే ఈవ్యాసాలు కాని మంచిపద్యం తీరు అంటూ వ్రాస్తున్న పద్యాలు కాని ఉపయోగిస్తాయి.

 

మాకంతా తెలుసును, మేమేమైనా బాలురమా అని కోపగించుకొనే వారికీ, పద్యం ఎలా వ్రాస్తే నేమి అని ఉదాసీనంగా ఉండేవారికీ, నాపట్ల వ్యక్తిగత వైమనస్యంతో నేను చెప్పటమే తప్పని భావించేవారికీ, ఇలాంటి వారు అనేకులకు ఈవ్యాసాలూ నాపద్యాలూ ఏమీ నచ్చవు, ఉపయోగించవు. అది నాతప్పు కాదు. దానికి నేనేమీ చేయలేను.

 

నిజానికి ఆట్టే వ్రాయగల స్థితిలో లేను. లోకహితంగా ఏదో కొంచెం వ్రాయాలన్న తాపత్రయంతో వ్రాస్తున్నాను. నా మనస్సుకు కొంచెం ప్రక్కకు మళ్ళించి ఈ సద్విషయాలను ముచ్చటించుకోవటం ద్వారా ఉపశాంతి పొందుదామన్న ఆశతో వ్రాస్తున్నాను శరీరం మరీ సహకరించకపోయినా.

 

కాని ప్రతివిషయంలోనూ రాధ్ధాంతం చేసే వారూ, ఎక్కడెక్కడికో పోయి నాపేరెత్తి అవాచ్యాలు వ్రాసే వారూ అక్షరాలా నిరుత్సాహం కలిగిస్తున్నారు.


దయచేసి ఆసక్తి కలవారు చదవండి. లేని వారు దూరంగా ఉండండి. సంతోషం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.