22, మార్చి 2018, గురువారం

వనజాతేక్షణు పట్టాభిషేకము


కనివిని యెఱుగని ఘనసంరంభము
వనజాతేక్షణు పట్టాభిషేకము

మునుపు కశ్యపుడు పురందరునకు
మునులు దేవతలు పొగడుచుండగ
ఘనముగ పట్టము గట్టినప్పుడును
మినుముట్టినదా మించి యింతగా

సురసేనానిగ సుబ్బారాయని
హరుడు నిల్పి పట్టాభిషేకమును
జరిపి నప్పటి సంరంభంబును
సరిపోలెడు నన జాలమె దీనిని

అవి జరిగినది త్రివిష్టపంబున
అవలోకించుట యతిభాగ్యమన
భువిలో నిదియే పొలుపు మీఱినది
దివిజుల గొప్పకు తీసిపోని దిది