4, ఆగస్టు 2019, ఆదివారం

చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు


చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు
శ్రీరాముడై మనకు చేరువైనాడు

నీతులు చెప్పలేదు నీతిగా నడచి
ప్రీతిపాత్రుడైనాడు భూతకోటికి
త్రేతాయుగంబున భూతలంబున
సీతాపతి యనుపేర చెలగె ధర్మము

పోరున రాకాసుల పొడిపొడి చేసె
ధారుణిపై నిలపెను ధర్మరాజ్యము
తారక లుండుదాక తరగని గొప్ప
పేరు స్వంతమైనట్టి వీరుడు వాడు

రామనామ మెంతో రమ్యమంత్రము
రామకథయె మిక్కిలి రసవంతము
రామభజన మోక్షసామ్రాజ్యప్రదము
రామచంద్రుడు దైవ  రాయడు కాన

4 కామెంట్‌లు:

  1. "దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
    ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌ ఇతిమే నిశ్చితా మతిః" -ఈ వాక్యంలో ద్వైత , విశిష్టాద్వైత, అద్వైత మతముల సారం ఇమిడి ఉన్నది. ఇంతకుమించి వివరణ ఎవరూ చెప్పలేరు, అంత గొప్ప వాక్యంగా తోస్తుంది. ఈ వాక్య రచయిత ఎవరు? చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచికి వారు..

      నన్ను నేను దేహమనే భావిస్తే ఆ దేవునికి దాసుడినౌతాను.
      నన్ను నేను జీవిగా భావిస్తే ఆ దేవుని అంశయై నిలుస్తాను.
      నన్ను నేను జీవాత్మగా భావిస్తే ఆ పరమాత్మలో భాగమై ఉంటాను అనగా.. సత్యం చిత్తశుద్ధి ఆనందాల కారకునికి ప్రతిబింబాన్నై నిలుస్తాను అనగా నీ ప్రతిరూపమే అంటే నీవే నేనుగా నేనే నీవుగా భావిస్తాను. ఇదే నా స్థితప్రజ్ఞత గల మనసు నాకు నేర్పింది.. ఓ మహానుభావా..

      ఒకానొకప్పుడు సీతమ్మ జాడకై వెదుకుతున్న రామునికి శబరి మాత ఋష్యశృంగ పర్వతం పై సుగ్రీవుని కలుసుకునేందుకు చెప్పగా.. సుగ్రీవుడు హనుమంతుని రాముడు వస్తున్న మార్గములో చూసి పంపితే.. రామునికి ఆ వచ్చినది హనుమ అని తెలిసి ప్రశ్నించగా ఆ ఆంజనేయుడు రాముని పోల్చుకుని పలికిన పద్యమది..!

      తొలగించండి
    2. మంచి వివరణ ఇచ్చారు శ్రీధర్ గారు. ధన్యవాదాలు.

      తొలగించండి


  2. ఈ వాక్య రచయిత ఎవరు ?


    నేనే.


    జిలేబి

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.