12, మార్చి 2018, సోమవారం

ఆంధ్రులకు ప్రస్తుతపరిస్థితుల్లో జీవించేహక్కు లేదనీ చెప్పరాదా?



బోలెడు వాగ్దానాలు.

అబ్బో అబ్బో అనుకున్నా రంతా.

దగాపడ్డ ఆంద్రులపై ఇంతంతన రాని అభిమానం కురిపించారు.

గద్దెకెక్కారు.

ఓడ దాటాక బోడిమల్లయ్య అన్న సామెతను వినిపిస్తున్నారు.

ప్రత్యేకహోదా ఇస్తామన్నామా ?  ప్రస్తుతపరిస్థితుల్లో వీలుపడదు అన్నారు.

ఇంకా అదివీలుపడదు ఇది వీలు పడదు అంటూనే ఉన్నారు.

నిన్నో మొన్నో బీజేపీలో ఉన్న తెలుగు వాళ్ళు ఏమన్నారూ?  అన్నింటికీ కేంద్రం సానుకూలంగా ఉందీ అని కదూ!

ఛీఛీ.

24 గంటలు చచ్చి గడిచాయో లేదో ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖకు రైల్వేజోన్ ఇవ్వటం వీలు పడదూ అని తేల్చేసారు నవ్వుతూ!

మోసం చేసి చిప్పచేతిలో పెట్టాయి ఆ దిక్కుమాలిన కాంగ్రెసూ ఈ బుధ్ధిమాలిన బీజేపీనూ.

ఇంకా మోసకారి మాటలే. ఇంకా దగాకోరు చేతలే.

ఏంచేసినా ఎలాగూ ఆంద్ర్హ్లులు బీజేపీని గద్దెకెక్కించరు కదా, వీళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టికోకపోతే కొత్తగా పోయేదేమి ఉంటుందీ అనికదూ వెధవ కుళ్ళు బుధ్ధి ఈ బుధ్ధిమాలిన పార్టీకి?

అయ్యా, ఎందుకిలా రోజుకో ప్రాణాంతకమైన జోక్ పేలుస్తున్నారూ?

ఓ దుర్వారగర్వాంధ బీజేపీ  పార్టీ మహానుభావులారా!
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రులకు బ్రతికే హక్కులేదని ఒక తీర్మానం చేసెయ్యండి.

మా ప్రాప్తం ఇంతే అనుకుంటారు.

ఇష్టం ఐతే ఇలా నిత్యక్షోభను అనుభవిస్తూ ఈ అవమానకరభారతంలో పౌరులుగా బ్రతుకీడుస్తారు.

లేదా చస్తారు - పీడా పోతుంది.

లేదా,  తెగిస్తే ఈభారతావనిలో తమభాగం తాము పంచుకొని వేరేదేశం ఏర్పాటుచేసుకుంటారు.

అదీ అంత పిచ్చిపనేమీ కాదని ఆంధ్రులు అనుకొంటే అందుకు 'ప్రస్తుతపరిస్థితులే' కారణం అని అందరూ అనుకుంటారు లెండి.

బోలెడు వనరులు కల నేల - సముద్రం ఆంద్రుల సొత్తు.

ఆ వనరుల నన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా ఈ ఉత్తరదేశపిచ్చి ఉన్నవాళ్ళు దోచుకుపోతూనే ఉన్నారు - పైసా వాటా కూడా ఇవ్వకుండా. నిజానికి అన్నింటిలోనూ ముందు అధమపక్షం 50% వాటా ఇచ్చి మరీ తీసుకొని వెళ్ళమనండి చాలు.

అంతర్యుధ్ధం వస్తుందా?

అయ్యబాబోయ్ అంతపని జరుగుతుందా? ఎంత ఘోరం ఎంతఘోరం!

బీద ఆంధ్ర ఓడిపోతుందా?

పెద్దమొత్తంలో ఆంధ్రులు చస్తారా?

చావనియ్యండయ్యా, ఈ బ్రతుక్కన్నా ఆ చావే గౌరవనీయమైనది కాదా?

చావుకు తెగించలేక ఇలాగే బ్రతుకీడ్చటం కుదరక ఎలాగూ బీదరికంలో మగ్గి చావక తప్పదు కదా? అలాంటప్ప్పుడు మీ హక్కులకోసం మీరు దెబ్బలాడండి.  అందుకు చావవలసి వస్తే అందరూ ఐనా సరే నిర్మొగమాటంగా చావండి. ఏమీ తప్పులేదు!

నిన్నో మొన్నో మన సుప్రీంకోర్టువారు ఒక తీర్పునిచ్చారు. చూసారా?

ఇంక జీవించే ఆశలేని వాడు గౌరవంగా మరణించాలని కోరుకోవటం సబబే నని.

గౌరవంగా అన్నిరాష్ట్రాలతో సమానంగా జీవించే హక్కు మీకు లేదని బీజేపీ వారు ఈరోజు చెబుతున్నారు. అన్నింటికీ సున్నపుబొట్లు పెట్టి వెక్కిరిస్తూనే మేం అంత మాట అనటం లేదూ అంటారు లెండి ఎలాగూ. కాని క్రియలో 100% వాళ్ళ చేతలకు అర్థం మీరు బ్రతికినా చచ్చినా మాకు ఒకటే అని చెప్పటమే.

అయ్యో అందరమూ చస్తె ఎలాగు, ఈ భూమి ఖాళీ ఐపోదా అని బెంగపడకండి. దానిలో జెండా పాతుకుందుకు వేరే వాళ్ళకు ఆసక్తి ఉండవచ్చును లెండి. అది మీకెందుకు?  మీ అనంతరం ఏం జరిగితే మీ కెందుకు?

అందుచేత బ్రతకాలో చావాలో ఇంకా నాన్చకుండా  తేల్చి చెప్పమనండి ముందు. ఎలాగూ మిమ్మల్ని చచ్చిన వాళ్ళ క్రిందో అంతకన్నా హీనంగానో చూస్తున్నారన్నది తెలుస్తూనే ఉన్నా, ఆ ముక్క బయటపడి చెబితే ఆ రువాత మీ ఆలోచన మీరు చేసుకుందుకు వీలుగా ఉంటుంది. ముసుగులో గ్రుద్దులాట లెందుకు అసహ్యంగా!

అయ్యా బీజేపీ వారూ, ఆముక్కేదో చెప్పేద్దురూ మీకు పుణ్యం ఉంటుంది!