24, నవంబర్ 2015, మంగళవారం

మదనవిలసితం.








         మదనవిలసితం.
         సురరిపుగణ సం
         భరమును చిదుమన్
         హరి రఘుపతియై
         ధర పొడమెనయా
 
   









మదనవిలసితం.
ఇది ఇంకొక చిట్టిపొట్టి వృత్తం.
దీనికి గణాలు  - న - గ అనేవి. అంటే పాదానికి 7 అక్షరాలే. ఆరులఘువులమీద ఒక గురువు.
28అక్షరాల్లో పద్యం సమాప్తం.
వృత్తం‌ కాబట్టి ప్రాస నియమం ఉంది. చిట్టిపాదాలు కాబట్టి యతిస్థానం ఏమీ లేదు.
పూర్వకవులు ఎవరన్నా ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక ప్రకారం చూస్తే ప్రతిపాదమూ  కిటకిట - తకిటా అన్నట్లు వస్తుంది. పైన ఇచ్చిన పద్యాన్ని ఇలా విరుపుతో చూపవచ్చును.

      సురరిపు  - గణ సం
      భరమును - చిదుమన్
      హరిరఘు - పతియై
      ధరపొడ  - మెనయా

ఇలా మదనవిలసితం నడచతురస్రగతిలో నడుస్తున్నది అన్నమాట.  అంటే నాలుగు మాత్రల తరువాత విరుపు.
ఆసక్తి కలవారు కొన్ని  మదనవిలసితాలు వ్రాయటానికి పూనుకోండి.    

అన్నట్లు ఈ‌ విలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు.