27, జనవరి 2020, సోమవారం

అమరావతికి ఊపిరి?

వనజ గారి అమరావతీ... ఊపిరి పీల్చుకో.. అన్న టపా చూసాను .
ఆవిడ ఆ టపాను 24న వ్రాసినా, నేను మూడు రోజుల తరువాత నేడు 27న మధ్యాహ్నం దాకా చూడలేదు.

అమరావతి గురించీ, సందు చూసుకొని కొన్ని అరాచకశక్తులు చేస్తున్న అనవసర కులనిందల గురించీ ఆవిడ చాలా బాధపడుతున్నారు.

అక్కడ ఆవిడ బ్లాగులో నేను వ్యాఖ్యలను ఉంచలేను. అది వేరే విషయం.

కాబట్టి విడిగా నా స్పందన ఇలా నా బ్లాగు ముఖంగా వ్రాస్తున్నాను.

ఆవిడ అన్నది నిజం.

ఈరోజుల్లో వార్తల పేరుతో కనవచ్చేవీ వినవచ్చేవీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

మన తెలుగుబ్లాగుల్లో ఐతే అంతా సో-కాల్డ్ పచ్చ బేచ్ v ఇన్ ఫాక్ట్ పిచ్చి బేచ్.
యుధ్ధవాతావరణం భీతావహంగా ఉంది.

నేను వార్తాపత్రికలు చదవటం మానివేసాను,
నేను వార్తల ఛానెళ్ళను విసర్జించాను.
నేను  యూట్యూబులో వస్తున్న విశ్లేషణలను చూడటం లేదు.
నేను బ్లాగుల్లో వస్తున్న రొట్టనూ దూరం పెడుతున్నాను, వీలైనంత వరకూ.
నేను నా మొబైల్ నుండి  వార్తల ఆప్ లను అన్నింటినీ తొలగించాను.
ఇవన్నీ చేసి కొద్ది రోజులు అయింది.

జరిగేది ఎలాగూ మనకు తెలియక పోదు కదా. పెద్ద ఇబ్బంది లేదు.
ప్రజలు గొప్ప మెజారిటీ ఇచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది.
అందుచేత ప్రజలకు పర్యవసానాలను అనుభవించక తప్పదు.

జరిగే వన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు కవి.
అలా అనుకోలేదని వాళ్ళు పెరుగుట విరుగుట కొరకే అనుకుంటారేమో మరి.

నిజానికి చాలా మంచి జరుగుతోందని కూడా కొందరు అంటున్నారు.

ఇంగ్లీషు వాడిది,  People get the government they deserve అని ఒక మంచి సామెత ఉంది.
అలా ఉంది పరిస్థితి అచ్చంగా.
ఈ తెలుగువాళ్ళని దేవుడే రక్షించాలి.

ప్రస్తుతం అకారణంగానో సకారణంగానో తెలుగువాళ్ళు తమను తామే బాగా శిక్షించుకుంటున్నారు.

ఇది నా అభిప్రాయం.

అందరికీ నా అభిప్రాయం నచ్చాలని లేదు.

(విషయం లేకుండా వీరావేశంతో ఎవరన్నా వ్యాఖ్యానిస్తే, అది వాళ్ళిష్టం. అది అచ్చు వేయటమా మానటమా అన్నది నా యిష్టం అని అందరూ గమనించగలరు.)