ఇదొక పెద్ద ప్రశ్న.
మనిషిని మనిషిగా చేసేది ఏమిటి?
ఈప్రశ్నకు సమాధానం కోసం ఆలోచించే ముందు ఒక విషయం గమనిక లోనికి తెచ్చుకోవాలి.
మనిషి ఒక జీవి. ముఖ్యంగా ఒక జంతువు.
జీవులు అన్నాక ఆహార భయ నిద్రా మైథునాలు అనే నాలుగు సహజ లక్షణాలు ఉంటాయి.మొదటి మూడు లక్శణాలూ స్వకీయమైన మనుగడకు అవసరమైనవి. నాలుగవది ఒక జాతిగా మనుగడకు అవసరమైనది.
జీవులు అన్నపుడు వృక్షజాతి కూడా లెక్కకు వస్తుంది.
జంతువులు అన్నపుడు అవి స్వయంచలనశక్తి కలవి కావటం వలన వృక్షజాతి కన్నా భిన్నత్వం కలవి.
జగదీశ్ చంద్ర బోస్ నిరూపించే వరకు వృక్షాలకు జీవం ఉన్నదనే పాశ్చాత్య ప్రపంచం నమ్మలేదు.
భారతీయ భావనలో వృక్షాలకు జీవం ఉందని ఏమిటి రాళ్ళకూ జీవం ఉందనే ఉదారభావన అనాది యైనది. మన శిల్ప శాస్త్రం శిలలకూ స్త్రీ పురుష లక్షణాలు చెబుతుంది.
జీవులకు ఆలోచన అనేదీ ఒకటి ఉంటుంది. నాలుగు సహజాతాలలో ఇది చెప్పబడక పోయినా, ఆలోచన కూడా ఒక ముఖ్య జీవ లక్షణం.
తాను ఉండాలీ అన్న భావన సహజాతం.
తాను సుఖంగా ఉండాలీ అన్న భావన ఆతరువాతది.
తానే సుఖంగా ఉండాలీ అన్న భావనా వైపరీత్యం ఆ తరువాత స్థాయి.
సుఖంగా ఉండాలీ అంటే ముందుగా సురక్షితంగా ఉండాలి కదా?
జీవులలో రక్షణ వ్యవస్థల గురించి మనకు నేడు బాగానే అవగాహన ఉంది.
వృక్షజాతి యైనా ప్రతికూల పరిస్థితుల్లో రక్షణకోసం ప్రయత్నాలు చేయటం గురించి తగినంత సమాచారం మనకు నేడు తెలుసు.
ఈవిధమైన ప్రాధమిక వాంఛలు రెడూ జీవులకు సహజాతాల తరువాతి లక్షణాలు ఆనుకోవచ్చును. అంటే ప్రతి జీవీ 1. తా నుండాలీ 2. తాను సుఖంగా ఉండాలీ అనేవి జీవుల మనుగడతో అనుబంధం కల మొదటి స్థాయి విషయాలు.
పురితన కాలంలో మానవుల విషయంలోనూ ఇంత వరకే కావచ్చును.
ఈస్థాయిలో జీవులకు ప్రకృతిపై ఆధిపత్యం అన్న భావన లేదు. ప్రకృతితో సహజీవనం అన్న భావనయే ఉంది.
కాని మనిషికి ఒక గమనిక ఉంది. అది ఎలా వచ్చింది అన్నది ఆలోచనీయం. ఆగమనిక ఏమిటంటే ప్రకృతి పైన తాను పెత్తనం చేయగలను అన్నది.
మనుష్యులలో కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఐతే కుటుంబ వ్వవస్థల మూలాలు ఇతర జంతు ప్రపంచం నుండే మనీషికి అబ్బినవి కాని మానవజాతికే ప్రత్యేకంగా ఏర్పడినవి కావు.
ప్రకృతిని కొంత తెలివిగా ఉపయోగించుకోవటం విషయంలో శరీర నిర్మాణ రీత్యా ఇతర జంతువుల కన్నా మనిషికి ఎక్కువ అవకాశం దొరికింది.
ఇది క్రమంగా ఆధునిక సమాజ నిర్మాణానికి దారితీసింది.
(ఇంకా ఉంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.