10, మార్చి 2023, శుక్రవారం

మధురం మధురం‌ మధురతరం

మధురం మధురం‌  మధురతరం మధురతమం జనులారా


రాముని నామమె మధురం మధురం రామస్మరణమె శుభదం
రాముని చరితమె మధురం మధురం ప్రేమామృత భరితం
రాముని పలుకే‌ మధురం మధురం కోమలపదసంభరితం
రామధ్యానమె మధురం మధురం మామకహృదయానందం
రాముని గుణమే మధురం మధురం భూమిజనైకనుతం
రాముని తత్త్వమె మధురం‌ మధురం బ్రహ్మాదికవినుతం
రాముని సేవయె మధురం మధురం క్షేమకరం సుఖదం
రాముని కరుణయె మధురం మధురం ప్రసాదించు మోక్షం


5 కామెంట్‌లు:

  1. నాస్తికులు, హేతువాదులు ఎందుకు రామున్ని, రామాయణాన్ని టార్గెట్ చేస్తున్నారు

    రిప్లయితొలగించండి
  2. 1. ఇతరమతాల ప్రవక్తలనో గ్రంథాలనో విశ్వాసాలనో ఆచారలనో టార్గెట్ చేయటానికి వీరికి దమ్ములు లేవుకదండీ.
    2. రాముడి గుడిని పడగొట్టినా రాముడి విగ్రహం తలతీసినా రాముడి మీదో రామాయణం మీదో అవాకులూ చెవాకులూ మాట్లాడినా. రాముడనే కాదు ఏ దైవస్వరూపాన్ని గురించి ఐనా ఎవరేమన్నా సరే అస్సలు వెన్నెముక లేనట్లు నోరుమూసుకొని మనకెందుకు అన్నట్లు చెవుడు నటించే స్థితప్రజ్ఞత్వం మనవాళ్ళదే‌ కదా. గిరీశం అన్నాడు కదా 'మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్' అని - ఊరకే‌ అన్నాడా చెప్పండి.
    3. వాల్మీకి మంధర గురించి చెబుతూ 'మంధరా పాపదర్శినీ' అన్నాడు. రాముడి పట్టాభిషేకం చెడగొట్టటానికి ఆమెకేమీ సరైన కారణమే లేదు. ఆమె స్వభావమే పాపభూయిష్ఠం కాబట్టి అని. అలాగ వీళ్ళకు కారణం అక్కరలేదు. పడే వాళ్ళు దొరికారు కాబట్టి ఏదో ఏదో అంటూ ఉంటారు.
    4. లౌకికవాదం అంటే హిందువులు నోర్మూసుకొని పడటం అనుకుంటున్నారు. ఇతరమతాలవాళ్ళూ ఈకుహనా మేధావులూ హిందువులను వెక్కిరించటం అనుకుంటున్నారు. అంతే.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ!

    ధర్మరాజు ద్యూతక్రీడకి ఎందుకు ఒప్పుకున్నాడు అనే విషయం మీద కష్టేఫలి దగ్గిర జరిగిన చర్చలో మీరు చెప్పిన విషయాన్నే ఇప్పుడు శ్రీ గరికిపాటి నరసింహా రావు గారు విశేషవ్యాఖ్యానం చేసి చెప్పారు.

    ఇక్కడ:https://www.youtube.com/watch?v=B8C38FSvd6Q&t=11s
    భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-6

    దరిద్రానికి ఆకలెక్కువ అన్న సామెత ఉందనే ఉంది కదా!అలాగే అజ్ఞానానికి ఆడంబరం ఎక్కువ.అందుకే,తమకు తెలియని దాన్ని గురించి కూడా తెలిసినట్టు వాగుతూ తమకన్న అజ్ఞానుల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి నాస్తికులు, హేతువాదులు రామున్ని, రామాయణాన్ని టార్గెట్ చేస్తున్నారు.

    అయితే, ముప్పాళ రంగనాయకమ్మ ఒక్కరే కాదు "రామాయణ సౌరభాలు" అని తెనాలి నుండి సెప్టెంబరు 1995లో డా.స్వర్ణ వాచస్పతి ఆమెకన్న ఛండాలమైన విశ్లేసహ్నలు చేశారు.

    ఏం లేదు,సొంత కష్టం లేని గొప్పదనం కావాలంటే ఇప్పటికే గొప్పవాళ్ళ మీద నాలుగు రాళ్ళేసి ఆయన అభిమానుల చేత తిట్లూ తన్నులూ తినే రకం ఫోకస్ కూడా కొందరికి కష్టపడి మంచిపనులు చేసి పేరు తెచ్చుకున్నంత గొప్పగానే ఉంటుంది.

    తమోగుణం అలానే పనిచేస్తుంది.ఎలుక/ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్నట్టు తర్కబధ్ధమైన వాదనకి వాళ్ళు రారు,మనకి లొంగరు.మనం అలా తమస్సుకి లొంగకుండా ఉంటే చాలు.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ మీరు ఇచ్చిన వీడియోలో 28:30 నుండి ఈవిషయంపై వ్యాఖ్యానించారు గరికపాటి వారు.

      తొలగించండి
    2. గరికిపాటి నరసింహా రావు గారు విశేషవ్యాఖ్యానం చేసి చెప్పటంలో ప్రసంగవేగంలో కొన్ని దాట్లు వేసారు. వ్యాసులవారు ధర్మరాజుతో యుధ్ధం నీనిమిత్తంగానూ దుర్యోధనుడి కారణంగానూ జరుగుతుందని స్పష్టంగానే చెప్పారు. కాబట్టి ధర్మరాజు గారు ఇక జ్ఞాతులతో వైరం రాకుండానే‌ చేయటానికి వారుకోరినట్లుగా వర్తించుదాం పన్నెండేళ్ళపాటూ అని తీర్మానం చేసారు. అదీ‌కాక గరికపాటి వారు మరొక విషయం కూడా దాటవేసారు. విదురుడి చేత ధృతరాష్ట్రుడు పంపిన సందేశంలో 'మాసభను చూదువు గానీ సుహృద్యూతమూ ఆడుదువుగానీ' అని స్పష్టంగానే చెప్పారు. అంతే కాని, గరికపాటి వారు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళాక కౌరవులు జూదం ఆడుదాం అనలేదు. ఇకపోతే రాజసూయం కారణంగా రాజహననం జరుగుతుందని ముందే తెలిసిన విషయమే - అదేదో శిశుపాలవధతో తీరిపోయింది కదా అని ధర్మజుడు అనుకొని వ్యాసులను ఆమాట అడిగాడు అంతే.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.