9, డిసెంబర్ 2021, గురువారం

బిపిన్ రావత్ & సహచర అధికారుల దుర్మరణం గురించి....

ఈరోజున ఈవిషయం ప్రస్తావిస్తూ ఈటపా వ్రాయాలని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే‌ భండారు శ్రీనివాసరావు గారి టపా వచ్చింది. దానిపై నాస్పందన తెలుపకుండా ఉండలేకపోయాను. ఆస్పందననే ఇక్కడ ప్రకటిస్తున్నాను టపాగా.


బిపిన్ రావత్ గురించి మీడియా నిరంతరాయంగా కథనాలను వడ్డిస్తూనే ఉంది.

కాని చూసారూ, ఆయనతో పాటుగా మరొక పదముగ్గురు స్వర్గస్థులయ్యారు. ఏ మీడీయాలోనూ వారి గురించిన వివరాలు కాదు కదా, కనీసం వారి పేర్లు కూడా రాలేదు. 
 
ఇది ఎంత అన్యాయం! వారు మాత్రం దేశభక్తులు కారా? వారు మాత్రం దేశసేవలోనే మరణించలేదా? వారికి మాత్రం ఊరూ పేరూ ప్రతిష్ఠా వంటివి ఏమీ లేవా? వారికి మాత్రం మనం తగిన విధంగా గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదా?

చివరికి మీరూ కనీసం వారి ప్రసక్తి ఐనా తీసుకురాలేదు.

వారి గురించే ఆలోచిస్తున్నాను నేను. అయ్యో వారిని కనీసం స్మరించేవారు కూడా లేరే అని. కేవలం వారి వారి కుటుంబసభ్యులు స్మరించుకుంటారులే‌ అని ఎవరూ వారిని నిర్లజ్జగా కనీసంగా ఐనా పట్టించుకొనక పోవటం దారుణాతిదారుణం!!

రావత్ గారి గొప్పదనం గురించి నేనేమీ విమర్శించటం లేదు. మిగిలిన వారిని కూడా కొంచెం స్మరించినంత మాత్రాన రావత్ గారి స్మృతికి అన్యాయం జరిగిపోదు కూడా.

ధన్యవాదాలు.