28, సెప్టెంబర్ 2014, ఆదివారం

గుఱ్ఱం జాషువా కవి గారి జయంతి నేడు






ఈ రోజున గుఱ్ఱం జాషువా కవిగారి జయంతి.  ఘనంగా జరిపిద్దా మనుకున్నా రట దొరతనం వారు. కాని తెలుగు అకాడమీయో‌ మరేదో ఇంకా విడిపోలేదట.  అందు చేత నిధుల కొఱత పీడిస్తోందట,  ఈ‌ మాట నిన్న వార్తల్లో వినిపించింది టీవీలో.  ఏ ఛానెలో - టీవీ౯ కావచ్చు. మరొకటి కావచ్చు విషయం అది.  ఏం చేస్తాం.  ఉన్నంతలోనే కాస్త ఘనంగా చేదా మనుకున్నారేమో నేడు వార్తల స్క్రోలింగుల్లో కనిపించిది జాషువా జయంతి అని.  అదీ సంగతి. 

జాషువాగారి గురించి వ్రాయగలిగినంత గొప్పవాడిని కాను. కాబట్టి ఆయన గురించి వెబ్ లోకంలో కనిపించిన కొన్ని లింకులు క్రింద ఇస్తున్నాను.  అక్కడ చదివి కొంత తెలుసుకొని తలచుకొని ఆనందించవ చ్చును,

ప్రస్తుతం నా దృష్టికి వచ్చిన సమాచారం ఇది. అన్నీ వరుసగా చదివినప్పుడు కొంత సమాచారం చర్వితచర్వణంగా అనిపించవచ్చును.  ఫరవాలేదు.  కొన్ని కొన్ని కొత్త విషయాలూ ప్రతీచోటా కనిపించవచ్చును కదా? అందుకే చదవండి.  నా కిష్టమైన గిజిగాడు పాఠం‌మాత్రం వెబ్‌లో ఎక్కడా కనిపించలేదు దానికీ‌ లింక్ ఇద్దామనుకుంటే.

అన్నట్లు ఆ మధ్యన మన హైదరాబాదులోని టాంక్‌బండ్ వద్ద ఉన్న విగ్రహాలను కొన్నింటిని ధ్వంసం చేయటం జరిగింది కదా ఉద్యమాల నేపద్యంలో.  ఆలా ధ్వంసమైన విగ్రహాల్లో జాషువాగారి విగ్రహమూ‌ ఉందని విగ్రహాల ధ్వంసం సబబుకాదు అన్న విశాలాంధ్రవారి అప్పటి వార్తలో చదివాను.  ఆంద్రప్రదేశం వారు మేలుకొని భేషజాలకు పోకుండా 'ఈ‌ సీమాంధ్ర మహానుభావులు'గా కొత్త తాతాచార్యులముద్ర వేయించుకొన్న తమవారి విగ్రహాలను తమ రాష్ట్రానికి తరలించుకుంటే వారిని ఆ మాత్రంగా నైనా కాస్త గౌరవించినవారు అవుతారేమో అన్నది ఆ రాష్ట్రప్రభుత్వంవారు ఆలోచించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.