3, ఫిబ్రవరి 2016, బుధవారం

శ్రీరామ ప్రియావృత్తం







           ప్రియ.
           నను నీ యశం
           బును రాఘవా
           కొని యాడనీ
           తనివారగన్




ప్రియ.

ఈ ప్రియావృత్తం ఒక ఇట్టిపొట్టి వృత్తం.  గణవిభజన స-వ. అంటే పాదానికి 5 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిగొడవ లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు.

ఈ ప్రియావృత్తంలోని నాలుగు పాదాలనూ కలిపి ఒకే పాదంగా వ్రాస్తే అది గీతిక అనే వృత్తం అవుతుంది.  దానికి గణవిభజజన స-జ-జ-భ-ర-స-వ అవుతుంది. గీతిక పాదం నిడివి ఇరవై అక్షరాలు కదా, అందుకని యతినియమం వర్తిస్తుంది 13వ స్థానం వద్ద. ఈ గీతికను అప్పకవి ప్రభాకలిత వృత్తం అన్నాడు.

ఇలా చిట్టి పొట్టి పద్యాలు ముక్తకాలుగా బాగుంటాయి. కావ్య నిర్మితిలో కాదని బహుశః  పూర్వకవులు భావించేవారేమో. అందుచేత ఇలాంటివి కావ్యాల్లో అరుదుగా కనిపిస్తాయి.