25, అక్టోబర్ 2018, గురువారం

జగన్నాటకం


జగన్నాటకం



బాగుంది.

నిజంగానే.
ఐతే ఎంతో అమాయకంగా చిన్నపిల్లవాడి చేష్టలాగా ఉంది.


జగన్నాటక సూత్రధారి ఎవరంటారు?

ఏమో
ఐతే పెద్దమోడీ కావచ్చును.
లేదా చిన్నమోడీ కూడా కావచ్చును.
ఒకవేళ సామంతప్రభువరేణ్యులే ఐనా ఆశ్చర్యం లేదు.


పరిణామం ఎలా ఉండవచ్చునూ?

రాష్ట్రపతిపరిపాలన విధించాలన్న మంత్రాంగంలో ఇది ఒక భాగం అనిపిస్తోంది.
కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలంలో జరిగిన సంఘటనకు రాష్ట్రప్రభుత్వాన్ని ఎలా రద్ధు చేస్తారూ? అనకండి
సవ్యమైన లాజిక్కులు ఆలోచనాపరులకు మాత్రమే అవసరం.
 వేయి రూపాయలనోట్లు సులువుగా దాచేస్తున్నారూ నల్లధనం పెరిగిపోతోందీ అని ఆలోచించి అవి రద్ధు చేసి రెండువేల రూపాయల నోట్లుతీసుకువస్తే నల్లధనం కట్టడి అవుతుందని లాజిక్ వెలిగించిన మహానుభావుల తంత్రాంగం సవ్యమైన లాజిక్కులు ఆలోచిస్తుందని అనుకోవటం అవివేకం.
విశాఖపట్నం ఆంద్రాలో ఉంది.
ఆంధ్రాముఖ్యమంత్రికీ (చి/పె)మోడీలకీ పడదు.
ఆంద్రాలో ఒక సంఘటన జరిగింది. (జరిపించాము)
అది చాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని చెప్పటానికి.
అసలు ఆంధ్రాముఖ్యమంత్రి అన్నింటికీ అడ్డుపడే రకం.
శ్రీకాకుళం అని ఒక చోట తుఫానొస్తే అక్కడికిపోయి కూర్చున్నాడు కర్రపెత్తనం చేస్తూ.
దానితో సహాయక చర్యలు కుంటుబడి జనం బీజేపీతోనూ దాని సామంతపార్టీలతోనూ పోయి మొత్తుకున్నారు.
పైగా పరిపాలన అధ్వాన్నంగా ఉండబట్టే విశాఖలో గొప్ప ప్రమాదం తప్పింది ఒక నాయకుడికి.
అర సెంటీమీటరో ఒకటిన్నర సెంటీమీటరో పొడుగు గాయం ఐనది అతడికి.
పాపం, నాలుగ్గంటలు కత్తిపోటుగాయంతోనే విమానంలో హైదరాబాదు వచ్చి వైద్యం చేయించుకున్నాడు.
హుటాహుటిన ఐసియూలో కట్టుకట్టి అంటీబయాటిక్సూ, పెయిన్ కిల్లర్సూ వంటి బహు ఖరీదైన మందులిచ్చారు.
శాంతిభద్రతలు ఇంత దరిద్రంగా ఉంటే ఎలా?
అందుకే రాష్ట్రపతి పాలన అనే అస్త్రం ప్రయోగిస్తాం అంటారు.


శుభం. అదెప్పుడూ?

ఏమో ఈ రాత్రి ఏక్షణంలో ఐనా రావచ్చును.
అర్థరాత్రి ప్రకటలన హుషారు ప్రథాని ఏలుబడి దేశం కదా మనది.
ఒకవేళ, ఈ సంఘటనతో మనమే అల్లరి పాలయ్యాం అనుకుంటే మాత్రం మరొక సంఘటన జరిగేంతవరకూ (లేదా జరిపించేంత వరకూ) వేచిచూస్తారు.


ఆంద్రాముఖ్యమంత్రిని అరెష్టు చేస్తారా?

రాష్ట్రపతి పరిపాలన విధించే పక్షంలో, కుట్రదారుడు ఆయనే అని (ఒక వీరవనిత భాషలో వాడే అని) అరెష్టు చేసినా చేయవచ్చును.


ఏ నిముషానికి ఏమి జరుగనో ఎవరూహించెదరు?

ఎందుకూ ఊహించటం? మీకేం పని లేదా?
జరిగేది చూడటమే.
మీరో నేనో ఆవేశపడితే ఒరిగేది ఏమీ లేదు సుమండీ.