13, అక్టోబర్ 2016, గురువారం

పరమశివుని శిష్యుడీ పరశురాముడు



పరమశివుని శిష్యుడీ పరశురాముడు
కర మఱుదగు విక్రమంబు కలిగినవాడు

జవమున క్రౌంచమును హంసలపాలు చేసి
శివు డిచ్చిన పరశువును చేతబట్టినాడు
అవలీలగ కార్తవీర్యార్జును పొగరణచి
కువలయపతిజాతిని కుళ్ళబొడిచినాడు
పరమ

భూమి నెల్ల కశ్యపుడను ముని కిచ్చినాడు
భూమీశులపైన పగను పోనడచినాడు
తామసము విడచినాడు తపసియై నాడు
ఆ మహేంద్రగిరివరం బందు నిలచినాడు
పరమ

విష్ణుమూర్తి యంశయై వెలసినాడు భువిని
విష్ణుసోదరికి పరమ వీరభక్తు డతడు
విష్ణుచాపము రామ విభుని చేతి కిచ్చి
విష్ణువే రాము డనుచు వినుతి చేసినాడు
పరమ