16, ఆగస్టు 2016, మంగళవారం

రాజారావు గారి పద్యాలను నేను తస్కరించానా?



పాఠకమహాశయులారా,

వరూధిని బ్లాగులో వచ్చిన ఈ క్రింది వ్యాఖ్యను పరిశీలించండి.

వెంకట రాజారావు . లక్కాకుల Aug 15, 2016, 7:27:00 PM
ఖ్యాతి వహించి నట్టి ఘను లక్కట నా పలు పద్య మాలికల్
వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి , ముందనుఙ్ఞ లే
దే! తమ చేతలేమొ ఘనతే , పెర వారివి తప్పిదా లగున్ ,
నీతులు జెప్పు కోవిదుల నీమము లిట్టివి , చూడ ముచ్చటౌ .


రాజారావు గారు ఘనుడు అంటే అనునిత్యం ఎత్తిపొడిచేది నన్నే కాబట్టి వారు తస్కరుడంటున్నది నన్నే అనుకొన వలసి వస్తోంది.

ఎంతో నొవ్వు కలిగింది ఈ నిరాధారమైన నిందాలాపానికి. వారి పద్యాల మాలలను దొంగిలించి నా బ్లాగులో ప్రచురించ వలసిన అగత్యం నాకేమి ఉంది?

నిజానికి, గత రాత్రి విపులమైన సమధానం వ్రాసాను. కాని ప్రచురించే ముందు సమయం తీసుకోవటం‌ మంచిదని ఆగాను.

నా సంగతి ఈ తెలుగుబ్లాగు లోకానికి చక్కగా తెలిసినదే. అటువంటప్పుడు ఇది నీలాపనింద అన్నది వారికి సులభగ్రాహ్యమే.  అందుచేత నేను విపులమైన అభ్యంతరాన్నీ వివరణనూ వ్రాయవలసిన అగత్యం ఏమీ లేదు కదా. కాబట్టి అలా విపులంగా వ్రాసినది మొత్తం తొలగించి కేవలం క్లుప్తంగా (నా రికార్డు కోసమే అనుకోండి) నా బ్లాగులో ఈ సంగతిని ప్రస్తావిస్తున్నానంతే.

వెత గలిగినన తాళుకొమ్మననే అని భగవద్వచనం అన్నట్లుగా సద్గురు త్యాగరాజస్వాముల వారు

   సద్భక్తులనడత లిట్లనెనే
   యమరికగా నాపూజఁ గొనెనే
   యలుగ వద్దనెనే
   విముఖులతోఁ జేరఁ బోకు మనెనే
   వెత గలిగిన తాళు కొమ్మనెనే


అని ఆరభిరాగం లో సాధించెనే అన్న పల్లవితో మొదలయ్యే తమ పంచరత్న కీర్తనలో ఉపదేశించారు కదా. అదే శిరోధార్యం.