15, డిసెంబర్ 2015, మంగళవారం

రామకుమార విలసితం





     కుమారవిలసితం.
     పురాకృతమున నే
     నరుండ నయితి నా
     కరంబు గొనుమయా
     బిరాన రఘుపతీ




కుమారవిలసితం.

ఈ కుమారవిలసితవృత్తానికి గణవిభజన జ-న-గ. యతిస్థానం లేదు. ప్రాసనియమం ఉంది.

ఈ జ-న-గ లక్షణంతొ వృత్తం కవిజనాశ్రయంలో కుమారవిలసితం అని కనిపిస్తుంది. మనం ఈ పేరుతోనే వ్యవహరిద్దాం. ఈ‌వృత్తాన్నే కావ్యాలంకారచూడామణి కారుడు కుమారలలితం‌ అన్నాడు. నడకను చూస్తే ఇది గణాంతాలలో విరుపుతో వస్తున్నట్లుగా అన్నట్లు కనిపిస్తోంది.

పై పద్యం నడక ఈ క్రింది విధంగా ఉన్నది:

పురా-కృ తమున నే
నరుం-డ నయితి నా
కరం-బు గొనుమ యా
బిరా-న రఘుప తీ

ఇందులో ప్రాసస్థానంపైన ఉన్న గురువును రెండు మాత్రల కాలం కన్నా మూడు మాత్రలుగా ఉఛ్ఛరించటం బాగుంటుంది. అలా చేసినప్పుడు మొదటి రెండు అక్షరాలతో ఒక చతుర్మాత్రాగణం గానూ పిదప నాలుగక్షరాలూ మరొక చతుర్మాత్రాగణంగానూ ఏర్పడతాయి.  పాదాంతగగురువును కూడా మరొకరెండు మాత్రలుగా ఆ అక్షరాన్నే ఒక చతుర్మాత్రాగణంగా ఉఛ్ఛరించటం పధ్ధతిగా ఉంటుంది. చివరి గురువుముందు విరుపుతో పైపద్యం నడిచింది. అలాగే తొలిగురువు తరువాత కూడా ఒక విరుపు ఉన్నది.  ఇలా ఈ వృత్తం ఒక చతురస్రగతిలో చక్కగా నడుస్తుంది. చతురస్రగతికి ఏకతాళం వాడుక చేయటం జరుగుతూ ఉంటుంది.

వేరే విధంగా కూడా ఈ చిట్టివృత్తాన్ని నడిపించటం కుదురుతుందేమో ఆలోచించ వలసిన విషయమే.

ఈ కుమారవిలసితానికి పూర్వకవి ప్రయోగాలున్నాయేమో తెలియదు.