26, ఆగస్టు 2013, సోమవారం

శ్యామలీయం భాగవతంలో ప్రథమస్కంధం సంపూర్ణం అయింది

ఈ క్రింద మంజరీ ద్విపదపద్యం రూపంలో మహాభాగవతం ప్రథమస్కంధం యొక్క విషయసూచిక ఇవ్వబడింది.  

ఇందులో ప్రతి లైనూ ఒక లింకు. మీరు క్లిక్ చేసి టపాను  శ్యామలీయం భాగవతం బ్లాగులో  చదువుకోవచ్చును. 

భాగవతం ప్రధమస్కంధం కథా మంజరి 

ఘనుడు పోతన్న భాగవతంబు నుడివె
అడిగిరి సూతుని హరికథల్ మునులు 
వ్యాసుని చింతను వచియించె నతడు 
వ్యాసుని వద్దకు వచ్చె నారదుడు 
భాగవతము వ్రాయ బనిచె నారదుడు
పలికెను తన పూర్వ భవము దేవర్షి 
వ్యాసు డంతట భాగవతమును జేసె 
ద్రోణపుత్రుడు చేసె దుష్టకార్యంబు 
గురుపుత్రు డెంతయు కోపన శీలి 
ద్రోవది సౌజన్యరూప దీపశిఖ 
హరిపాదముల వ్రాలె నభిమన్యు పడతి 
హరిని వైరాగ్యంబు నడిగెను కుంతి 
పాండవాగ్రజు చింత బాపె భీష్ముండు 
దివి కేగె భీష్ముండు దేవసన్నిభుడు
అవనికి ధర్మజు నభిషిక్తు జేసి
వాసుదేవుడు వచ్చె ద్వారకా పురికి
వేలాది సతులకు వేడుక జేసె  
అంధక్షితీశ్వరుం డడవుల కేగె 
బంధుమోహంబును వదలె ధర్మజుడు 
కరిపురంబును చేరె ఘనుడు విదురుడు  
కాలగతిని గాంచి కలగె ధర్మజుడు 
వైకుంఠమున కేగె వాసుదేవుండు
కలియుగం బను కష్టకాలంబు వచ్చె
పార్థుని పౌత్రుండు పాలకుండయ్యె 
ధర్మమార్గంబున ధర నేల జొచ్చె
హరివియోగంబున కవని శోకించె 
ధర్మావనుల కలి తన్ని హింసించె
వాని పరీక్షిత్తు పట్టి శిక్షించె 
హరికీర్తి నుడివి నా డంత సూతుండు 
కాలంబుచే రాజు కదిలె వేటలకు 
రాజును మునికుమారకుడు శపించె
భూమీశునకు వార్త ముని యెఱిగించె 
ప్రాయోపవేశంబు ప్రకటించె రాజు 
శుకయోగి వచ్చె రాజోత్తము జూడ
మోక్షమార్గము వేడె భూమీశు డతని 

 
ఇతర వివరణలు